పదో తరగతి పరీక్షల దృష్ట్యా రాష్ట్ర విద్యా శాఖ సూచనలు
_🌍రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్8 వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రిపి. సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు._
★ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధినిస్తూ ఈ పరీక్షలను జూన్8 వ తేదీ నుండి జూలై 5 వ తేదీవరకునిర్వహించబోతున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో మార్చిలోజరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము ఆదేశాలతో గతంలో వాయిదా వేయడం
జరిగిందని, ప్రస్తుత పరిస్థితులలో పరీక్షల నిర్వహణకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించడంతో ఏర్పాట్లుచేపట్టామని తెలిపారు.
★పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల భౌతిక దూరాన్ని పాటించాలన్న ఉన్నత న్యాయస్థానము
సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,580 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలనుఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
★ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను
వినియోగించుకోబోతున్నామని వెల్లడించారు.
★ గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాల భవనాల్లోనూ, గతంలో
కేటాయించిన పరీక్షా కేంద్రానికి అర కిలోమీటర్ లోపలే నూతన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని
మంత్రి తెలిపారు.
★పరీక్షా కేంద్రాల మార్పును వారి సంబంధిత ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్
ద్వారా తెలియజేస్తామని మంత్రి వివరించారు.
★పరీక్షా కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయడంతో పాటు
విద్యార్థులకు మాస్కులను అందజేస్తామని, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే పరీక్షా కేంద్రం లోపలికి
అనుమతిస్తామని మంత్రి తెలిపారు.
*★ ప్రతి బెంచిపై ఒకరు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లుచేస్తున్నామనిఅన్నారు.*
★పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి గంట ముందే అనుమతిస్తున్నామని, విద్యార్థులు కూడా
పరీక్షా కేంద్రానికి ముందే వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
★ కోవిడ్ -19 నేపథ్యంలో విద్యార్థులకు
ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి
విజ్ఞప్తి చేశారు.
★పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా అవసరమైన ప్రత్యేక
బస్సులను ఆర్టీసి నడుపుతుందని మంత్రి తెలిపారు.
★ఈ పరీక్షలకు సంబంధించి ఏవైనా సలహాలు, సూచనలు
కావాలనుకొనే విద్యార్థుల తల్లిదండ్రుల కోసం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
*★పరీక్షకుహాజరయ్యే విద్యార్థి ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్నట్లయితే వారిని ప్రత్యేకగదుల్లోఉంచిపరీక్షరాయించనున్నట్లు వివరించారు. ఎవరైనా ఇన్విజిలేటర్లకు దగ్గు, జలుబు, జ్వరం ఉన్నట్లయితే వారిని విధులనుండి తప్పించి రిజర్వులో ఉన్నవారితోపరీక్షలనునిర్వహిస్తామని అన్నారు.*
★పరీక్షా కేంద్రాల్లో విధులను
నిర్వర్తించే సిబ్బంది ప్రత్యేకంగా మాస్కులను ధరించడంతో చేతులకు గ్లోజ్ లను కూడా ధరించే విధంగా
ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.
★పరీక్షా తేదీలు ఖరారైనందున విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వాలని,
ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని పరీక్షలను నిర్వహిస్తుందని
భరోసా ఇచ్చారు.
_🌍రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్8 వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రిపి. సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు._
★ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధినిస్తూ ఈ పరీక్షలను జూన్8 వ తేదీ నుండి జూలై 5 వ తేదీవరకునిర్వహించబోతున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో మార్చిలోజరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము ఆదేశాలతో గతంలో వాయిదా వేయడం
జరిగిందని, ప్రస్తుత పరిస్థితులలో పరీక్షల నిర్వహణకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించడంతో ఏర్పాట్లుచేపట్టామని తెలిపారు.
★పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల భౌతిక దూరాన్ని పాటించాలన్న ఉన్నత న్యాయస్థానము
సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,580 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలనుఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
★ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను
వినియోగించుకోబోతున్నామని వెల్లడించారు.
★ గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాల భవనాల్లోనూ, గతంలో
కేటాయించిన పరీక్షా కేంద్రానికి అర కిలోమీటర్ లోపలే నూతన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని
మంత్రి తెలిపారు.
★పరీక్షా కేంద్రాల మార్పును వారి సంబంధిత ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్
ద్వారా తెలియజేస్తామని మంత్రి వివరించారు.
★పరీక్షా కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయడంతో పాటు
విద్యార్థులకు మాస్కులను అందజేస్తామని, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే పరీక్షా కేంద్రం లోపలికి
అనుమతిస్తామని మంత్రి తెలిపారు.
*★ ప్రతి బెంచిపై ఒకరు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లుచేస్తున్నామనిఅన్నారు.*
★పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి గంట ముందే అనుమతిస్తున్నామని, విద్యార్థులు కూడా
పరీక్షా కేంద్రానికి ముందే వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
★ కోవిడ్ -19 నేపథ్యంలో విద్యార్థులకు
ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి
విజ్ఞప్తి చేశారు.
★పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా అవసరమైన ప్రత్యేక
బస్సులను ఆర్టీసి నడుపుతుందని మంత్రి తెలిపారు.
★ఈ పరీక్షలకు సంబంధించి ఏవైనా సలహాలు, సూచనలు
కావాలనుకొనే విద్యార్థుల తల్లిదండ్రుల కోసం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
*★పరీక్షకుహాజరయ్యే విద్యార్థి ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్నట్లయితే వారిని ప్రత్యేకగదుల్లోఉంచిపరీక్షరాయించనున్నట్లు వివరించారు. ఎవరైనా ఇన్విజిలేటర్లకు దగ్గు, జలుబు, జ్వరం ఉన్నట్లయితే వారిని విధులనుండి తప్పించి రిజర్వులో ఉన్నవారితోపరీక్షలనునిర్వహిస్తామని అన్నారు.*
★పరీక్షా కేంద్రాల్లో విధులను
నిర్వర్తించే సిబ్బంది ప్రత్యేకంగా మాస్కులను ధరించడంతో చేతులకు గ్లోజ్ లను కూడా ధరించే విధంగా
ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.
★పరీక్షా తేదీలు ఖరారైనందున విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వాలని,
ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని పరీక్షలను నిర్వహిస్తుందని
భరోసా ఇచ్చారు.
Good Job
ReplyDelete